Monday, December 23, 2024
Home తెలంగాణ Metro Plans To Extend Services till 1am:: గణేష్‌ న‌వ‌రాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైలు..

Metro Plans To Extend Services till 1am:: గణేష్‌ న‌వ‌రాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైలు..

by స్వేచ్ఛ
0 comment 59 views
METRO PLANS TO EXTEND SERVICE TILL 1AM

వినాయక చవితి(GANESH CHATURTHI) వచ్చేస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. మరో వారంలో వినాయక నవరాత్రులు(NAVARATHRULU ప్రారంభంకానున్నాయి. ఎప్పటిలాగే.. ఈ ఏడాది  కూడా ఖైరతాబాద్‌(KHAIRTHABAD)లో గణనాధుడి భారీ విగ్రహం ప్రతిష్టించబోతున్నారు. ఈ ఉత్సవాలకు నగరవాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీగా  తరలివస్తున్నారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం(NIMMAJANAM) వరకు.. హైదరాబాద్‌(HYDERABAD)లో సందడి వాతావరణం కనిపిస్తోంది. గల్లీకో వినాయక మండపం కనిపిస్తుంది. డప్పుల మోత  మారుమోగుతుంది. చిన్నాపెద్దా అంతా ఎంతో ఉత్సాహంగా… గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.

హైదరాబాద్‌ గణేష్‌ చతుర్ధి వేడుకల్లో… ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేకతే వేరు. భారీ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.  నగ‌రం న‌లుమూల‌ల నుంచే  కాకుండా పొరుగు రాష్ట్రాల‌పై క‌ర్ణాట‌క‌(KARNATAKA), మ‌హారాష్ట్రాల(MAHARASHTRA) నుంచి కూడా త‌ర‌లివ‌స్తుంటారు భక్తులు. పండుగ మొదటి రోజు నుంచే వేల మంది భక్తులు ఖైరతాబాద్‌ వస్తుంటారు. దీంతో  ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు(TRAFFIC STRUGGLES) తప్పవు. ప్రయాణీకుల(PASSENGERS) రద్దీకి అనుగుణంగా అదనపు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 

వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(METRO RAIL LIMITED) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రయాణం సులువుగా… సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు  చేపడతామని చెప్పింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. గణేష్‌ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు  సేవలు పెంచుతామని ప్రకటించింది. గణేష్‌ న‌వ‌రాత్రుల సందర్భంగా మెట్రో రైళ్ల‌ను అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు నడపాలని యోచిస్తున్న‌ట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.  గ‌తంలో మాదిరిగానే ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  చెప్పారు. 

ఇక, ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో అద‌న‌పు టికెట్ కౌంట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా  టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం కల్పిస్తున్నారు. భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఖైర‌తాబాద్ మెట్రో స్టేష‌న్ దగ్గర అద‌న‌పు భ‌ద్ర‌త‌ను  ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా… ఇతర కీలకమైన మెట్రో స్టేషన్లలో దగ్గర కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. 

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News